స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :-భారత టీ20 జట్టు నాయకత్వ మార్పుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ను మార్చాలని భావిస్తే, సెలక్టర్ల ముందున్న అత్యుత్తమ ప్రత్యామ్నాయం శ్రేయస్ అయ్యర్ అని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఒక కథనంలో వెల్లడించింది.
ముఖ్య అంశాలు:-నాయకత్వ పటిమ ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ చూపిన అద్భుత నాయకత్వ ప్రతిభ అతనిపై నమ్మకాన్ని పెంచింది. జట్టును సమర్థవంతంగా నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.నాల్గవ స్థానంలో తిరుగులేని ఆటగాడు టీ20 క్రికెట్లో 4వ స్థానంలో (No. 4) బ్యాటింగ్ చేయడానికి అయ్యర్ అత్యంత అనువైన ప్లేయర్ అని, ప్రస్తుతం అతని స్థానాన్ని భర్తీ చేసే మరో ఆటగాడు జట్టులో లేరని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.పోటీలో ఇతర ఆటగాళ్లు కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, అనుభవం మరియు నాయకత్వ లక్షణాల పరంగా సెలక్టర్లు అయ్యర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ టీమ్ ఇండియా మేనేజ్మెంట్ దీర్ఘకాలిక ప్రణాళికలతో వెళ్లాలనుకుంటే, శ్రేయస్ అయ్యర్ తదుపరి టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.