స్వస్తిక్ న్యూస్, నేషనల్:- ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు ఇప్పటివరకు ఉన్న అత్యున్నత స్థాయి Z+ కేటగిరీ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్య అంశాలు:-పదవి నుంచి తొలగింపు సొంత పార్టీ నేతలతో వచ్చిన విభేదాల నేపథ్యంలో, ఇటీవల ఆయనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు.కేంద్రం యోచన పంజాబ్ పోలీసుల తాజా నిర్ణయంతో, కేంద్ర ప్రభుత్వం ఆయనకు సెంట్రల్ సెక్యూరిటీని కేటాయించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు మరియు ఈ భద్రత తగ్గింపు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.