స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గోదావరి వరదనీటిని సమర్థంగా వినియోగించి వ్యవసాయం, తాగునీరు మరియు పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ YSR కాంగ్రెస్ పార్టీ పై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని అడ్డుకోవడానికి గతంలో అనేక అవరోధాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాలకు కూడా ప్రతిపక్ష పాలన కారణమని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని అన్నారు.కాని అమరావతి నిర్మాణం విషయంలో రైతుల త్యాగాలను ప్రభుత్వం మరచిపోలేదని సీఎం స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు.