Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

మహిళా రిజర్వేషన్ల జాప్యం అన్యాయం: ప్రధాని మోదీ

14 Apr 2026
12:05 PM
107

స్వస్తిక్ న్యూస్, జాతీయం:- చట్టసభల్లో మహిళల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యం జరిగితే అది మహిళా లోకానికి చేసే అన్యాయమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

వార్తలోని ముఖ్యాంశాలు:-​ 33 శాతం కోటా చట్టసభల్లో మహిళలు బలంగా గళమెత్తే సమయం ఆసన్నమైందని, అందుకే వారికి 33 శాతం సీట్లను కేటాయించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.మహిళలకు లేఖ ఈ నిర్ణయాన్ని వివరిస్తూ దేశంలోని నారీమణులకు ప్రధాని ప్రత్యేకంగా లేఖ రాశారు.నారీ శక్తి వందనం అధినియం ఏప్రిల్ 16 నుండి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియం’ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.జాప్యంపై హెచ్చరిక మహిళా సాధికారతకు ఈ బిల్లు ఎంతో కీలకమని, దీనిపై ఆలస్యం చేయడం సబబు కాదని మోదీ పేర్కొన్నారు.

​మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates