Friday, 17 April 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

​గ్యాస్ కొరతకు చెక్: 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల సరఫరా పెంపు

13 Apr 2026
09:08 AM
264

స్వస్తిక్ న్యూస్, జాతీయం:- దేశంలో గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సిలిండర్లతో పాటు చిన్న తరహా 5 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. ముఖ్యంగా వలస కార్మికులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది.

ముఖ్య విశేషాలు:- మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 13 లక్షలకు పైగా 5 కేజీల సిలిండర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీటి రోజువారీ విక్రయాలు లక్ష యూనిట్ల మార్కును దాటడం విశేషం. బరువు, సులభంగా లభించే వెసులుబాటు ఉండటంతో వలస కార్మికులు ఈ 5 కేజీల సిలిండర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవసరాలను తీర్చడంలో భాగంగా ప్రభుత్వం మార్చి నుంచి కొత్తగా 4.24 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లను యాక్టివేట్ చేసింది. వినియోగదారులకు అందే డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయినట్లు సమాచారం.గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడం ద్వారా సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates