Tuesday, 14 April 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

పత్తి రైతులకు కేంద్రం తీపి కబురు: 'ధర లోటు చెల్లింపు పథకం' అమలుకు నిర్ణయం

13 Apr 2026
08:56 AM
125

స్వస్తిక్ న్యూస్, న్యూఢిల్లీ:- మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గుతున్న వేళ రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి రైతులకు నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం (Price Deficiency Payment Scheme - PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది.

వార్తలోని ముఖ్యాంశాలు:- పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఎంపిక చేసింది.కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉన్నప్పుడు, ఆ వ్యత్యాసాన్ని (తేడాను) ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మద్దతు ధర మరియు మార్కెట్ ధర మధ్య ఉండే ఆ తేడా మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు.

రైతులకు భరోసా:- ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, బహిరంగ మార్కెట్‌లో పత్తి ధరలు పడిపోయినప్పటికీ రైతులకు ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లదు.ఈ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల నుండి తమను కాపాడటానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates