Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

మిర్చి రైతులకు కాసుల పంట: భారీగా పెరిగిన ధరలు!

14 Apr 2026
05:52 PM
67

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ:- ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు అదృష్టం వరించింది. మార్కెట్‌లో అన్ని రకాల మిర్చి ధరలు భారీగా పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మార్కెట్ ధరల వివరాలు:- తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నమోదైన ధరలు ఈ విధంగా ఉన్నాయి:తేజా మిర్చి (సాధారణ రకం): క్వింటాకు రూ. 21,000 పలికింది.ఏసీ మిర్చి క్వింటాకు రూ. 21,580 ధర లభించింది.టమాటా & ఎల్లో మిర్చి ఈ రకం మిర్చి ధరలు ఏకంగా రూ. 40,000 నుండి రూ. 50,000 వరకు పలికినట్లు సమాచారం.

పెరుగుదలకు కారణాలు:- చైనా వంటి దేశాల నుండి ఆర్డర్లు భారీగా పెరగడంతో మార్కెట్‌లో మిర్చికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది దిగుబడితో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో మిర్చి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది.

 

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates