స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
గాయం వివరాలు:-ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి (Thigh Muscle Injury) గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఈ నొప్పితో బాధపడుతున్నారని, కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ NDTV పేర్కొంది.ముంబై ఇండియన్స్పై ప్రభావం.ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో 'హిట్మ్యాన్' జట్టుకు దూరం కావడం ముంబై ఆశలపై నీళ్లు చల్లే అవకాశం ఉంది. రోహిత్ వంటి అనుభవం ఉన్న ఆటగాడు లేకపోవడం జట్టు బ్యాటింగ్ లైనప్కు పెద్ద లోటుగానే చెప్పవచ్చు.తదుపరి మ్యాచ్ల షెడ్యూల్.ముoబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లను ఈ క్రింది జట్లతో ఆడాల్సి ఉంది.రేపు పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది.ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్ (GT)తో మ్యాచ్ జరగనుంది.
రోహిత్ శర్మ ఈ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉంటారో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన చికిత్స అందించి, త్వరగా కోలుకునేలా టీమ్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటోంది.