Wednesday, 25 March 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

కూటమి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి : ఎరిక్షన్ బాబు

24 Mar 2026
02:40 PM
168

స్వస్తిక్ న్యూస్ , పుల్లలచెరువు  :-   సోమవారం రాత్రి పుల్లలచెరువు మండలంలోని మల్లపాలెం గ్రామంలో శ్రీ శనగా సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా, పరిసర గ్రామ ప్రజలు, పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి పరిపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. త్వరలోనే వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. టీడీపీ కన్వీనర్ గోవింద్, నాయకులు శనగా. నారాయణ రెడ్డి, గజ్వల్లి. భాస్కర్, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates