Tuesday, 14 April 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

అన్నదాతకు 'ఉల్లి'పోటు: భారీగా పడిపోయిన ధరలు

13 Apr 2026
08:21 AM
90

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ:-

సంగారెడ్డి:- ఉల్లి ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకప్పుడు లాభాలు తెచ్చిపెట్టిన ఉల్లి, ఇప్పుడు కనీస పెట్టుబడిని కూడా రాబట్టలేకపోవడంతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ధరల పతనం - ముఖ్యాంశాలు:- ధరల్లో భారీ వ్యత్యాసం: గతేడాది ఏప్రిల్ (APR) నెలలో క్వింటాల్ ఉల్లి ధర రూ. 2,300 పలకగా, ప్రస్తుతం అది ఏకంగా రూ. 504 కు పడిపోయింది.

​మార్కెట్ పరిస్థితి:- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మార్కెట్‌లో ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

​అధిక దిగుబడి:- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు అవుతోంది. జనవరి నుండి మే (JAN-MAY) మధ్య కాలంలో దిగుబడి భారీగా పెరగడంతో మార్కెట్‌కు నిల్వలు పోటెత్తాయి. ఇదే ధరల పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.వినియోగదారులకు పండుగ.. రైతుకు భారంగా: హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో వ్యాపారులు రూ. 100 కే 5 నుండి 8 కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తున్నారు. వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా, పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates